కేంద్రం రద్దు చేసిన కార్మిక చట్టాలు పునరుద్దరించాలి
...............
ఎపి డబ్ల్యూ జె ఎఫ్ ఆధ్వర్యంలో కలక్టరేట్
వద్ద నిరసన.
.............
ఏలూరు :
కేంద్రం రద్దు చేసిన రెండు కార్మిక చట్టాలు పునరుద్ద రించి కలం కార్మికులైన జర్నలిస్ట్ లకు న్యాయం చెయ్యాలని ఏపిడబ్ల్యూజె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె ఎస్ శంకర రావు డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఇక్కడ కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద
ఎపి డబ్ల్యూజెఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్ లతో జర్నలిస్ట్ లు
నిరసన కార్యక్రమం చేపట్టారు.జిల్లా అధ్యక్షులు
ఎస్ డి జబీర్ ఆధ్వర్యంలో
జరిగిన నిరసన ప్రదర్శన లో సంఘాలకు అతీతంగా పాత్రికేయులు, రైతు సంఘ ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్బంగా
రద్దు చేసిన రెండు కార్మిక చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై వత్తిడి తెచ్చి పునరుద్దరణ అయ్యే టట్టు
చూడాలని నినాదాలు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికలు సమయం లో ఇచ్చిన హమీ లు అమలు చెయ్యాలని కోరారు.
పని చేసే జర్నలిస్ట్ లు అందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డు అక్రిటిడేషన్ ఇవ్వాలని,
ప్రతి వారికి మూడు సెంట్లు ఇంటి స్థలం మంజూరు చెయ్యాలని డిమాండ్ చేశారు.సీనియర్ పాత్రికే యులకు తమిళ నాడు, కేరళ పంజాబ్ రాష్టాల్లో మాదిరి గా యాభై ఏళ్ళు దాటిన వారికి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని కోరారు.
ఈ నెల 11వ తేదీన మండల కేంద్రాల్లో ఎపి డబ్ల్యూ జెఎఫ్ తలపెట్టిన
ధర్నా లో పాత్రికేయ సోదరులు అందరూ పాల్గొని అక్కడతహసీల్దార్
లకు డిమాండ్ లతో కూడిన వినతి పత్రం ఇవ్వాలని పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా ఫెడరేషన్ కార్యదర్శి హరీష్ జర్నలిస్ట్ ల ఐక్యత గురించి మాట్లాడారు. సీనియర్ జర్నలిస్ట్లు కె బాలశౌరి,
ఎం. గంగ రాజు,
జయరాం, హరీష్, దాసు, మిల్టన్, దొరబాబు,
సన్నీ, బాబ్జి, అర్జున్, నవీన్, ప్రతాప్, సత్యనారాయణ, శ్రీనివాస్, సజ్జి, రమేష్, షాజహాన్, శరత్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల చట్టాలను పునరుద్ధరించాలి.
ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీల తో ధర్నా.
జర్నలిస్టులకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలి.
స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కు వినతి.
కేంద్రప్రభుత్వం 44 కార్మిక చట్టాల రద్దు చేసిన చట్టాల్లో జర్నలిస్టులకు సంబంధించిన రెండు చట్టాలు వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతనాల చెల్లింపు చట్టం 1958 రద్దు మానుకోవాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, రాష్ట్ర నాయకులు గోరంట్లప్ప, కేబి శ్రీనివాసులు,జిల్లా కన్వీనర్ నాగేంద్ర, ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు హుస్సేన్, సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గుప్తా,వీడియో జర్నలిస్ట్ రాష్ట్ర నాయకులు హుస్సేన్ డిమాండ్ చేశారు.సోమవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్షుడు శివ శంకర్ అధ్యక్షత న సోమవారం నల్లబ్యాడ్జీలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ జర్నలిస్ట్ చట్టాలు రద్దు చేయడం మనుకోవాలని రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ధర్నాలకు పిలుపునిచ్చారన్నారు. జర్నలిస్ట్ లకు జరుగుతున్న దాడులకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని పలుమార్లు కోరుతున్నా నేటికి వాటి ఊసు లేదు. కానీ ఉన్నటువంటి చట్టాలను రద్దు పరచడం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి సరైంది కాదన్నారు.సమాజంలో జర్నలిస్టుల పాత్ర గుర్తించి రద్దు చేసిన రెండు చట్టాలను పునరుద్ధరించాలని కోరుతున్నామన్నారు.కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలు చేస్తున్న కేంద్రం కార్మికుల గొంతును నొక్కుతూ చట్టాలను రద్దు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.ఇప్పటికైనా కార్మికులను ఆదుకోవాలని ,జర్మలిస్టుల చట్టాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా జర్నలిస్టుల ఐక్యతతో మరింత తీవ్రతరంచేస్తామన్నారు.అనంతరం స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కు వినతిని అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు సునీల్ కుమార్, నగర ప్రధాన కార్యదర్శి ఎర్రమల, ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వడ్డే శ్రీనివాసులు, సీనియర్ నాయకులు రాజశేఖర్ నాయుడు,నగర ఉపాధ్యక్షుడు బాబు,నాయకులు చెన్నయ్య,అనిల్,మురళి,చంద్రశేఖర్, లక్ష్మయ్య,జర్మలిస్టులు పాల్గొన్నారు.
వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను పునరుద్ధరించాలి
కలెక్టరేట్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన
విజయనగరం జూన్ 9:
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్ట్ చట్టాలు 1995, 1998 చట్టాలను పునరుద్ధరించాలని, వృత్తి ప్రమాణాలను, వేజ్ బోర్డు చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలోన స్థానిక కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. చట్టాల రద్దు పై కేంద్ర వైఖరిని నిరసిస్తూ పెద్దపెటున నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రమేష్ నాయుడు మాట్లాతూ వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు కాపాడేందుకు, వేతనాల చెల్లింపుకు, ఇతర సదుపాయాలకు, వేతన బోర్డుల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై ఈ చట్టాలు వర్కింగ్ జర్నలిస్టులకు ఏర్పాటును అందించే 1995, 1998 చట్టాలను రద్దు చేయడం దుర్మార్గం అని అన్నారు. ఈ చట్టాల రద్దు వల్ల జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలకు విఘాతం కలగడంతో పాటు వేతన చెల్లింపులకు సంబంధించిన అంశాలు వస్తావనకు రాకుండా పోతాయన్నారు. ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్టులు యాజమాన్యాల నుంచి చట్టబద్ధమైన రక్షణ లేకపోవడంతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఉన్న ఈ రెండు చట్టాలను తిరిగి పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ కోరుతోందన్నారు. మొత్తం మీడియాను ఒకే చట్ట పరిధిలోకి తెచ్చే విధంగా సరికొత్త చట్టాలు రూపొందించాల్సింది పోయి ఉన్న చట్టాలను రద్దు చేయడం ఎంత మాత్రం సరైన కాదని కాదన్నారు. రాష్ట్రవ్యాప్త ఎరుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. మురళి శంకర్రావు పత్తివాడ అప్పారావు బి.ప్రసాదరావు, గొర్లె సూరిబాబు తదితరులు పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ పిలుపుమేరకు జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు బెంగళూరు ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాను ఉద్దేశించి ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కవర కుంట్ల జయరాజ్ మాట్లాడుతూ
వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతన చెల్లింపు చట్టం 1958.
వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు కాపాడేందుకు జర్నలిస్ట్ లిస్టులు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి ప్రజా సం గాలు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీ బీజేఏ జిల్లా అధ్యక్షులు చల్లా జయచంద్ర, ప్రధాన కార్యదర్శి నీరజాక్షలు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు
కార్మిక చట్టాల రద్దులో భాగంగా వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతనాలు చెల్లింపు చట్టం 1958 లను రద్దు చేయడానికి నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపుమేరకు జూన్ 9వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి.
శ్రీకాకుళం జిల్లా మొదలు విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లా వరకు అన్నిచోట్ల వివిధ రూపాలలో ఈ ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. జిల్లా కేంద్రాలలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేయడం, ధర్నాలు, ప్రదర్శనలు చేపట్టి వర్కింగ్ జర్నలిస్టుల చట్టాల రద్దును నిరసిస్తూ ఆందోళన చేశారు. ఆ చట్టాలను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎస్ వెంకట్రావు అధ్యక్షులు
జి ఆంజనేయులు
ప్రధాన కార్యదర్శి
1980 దశకం వరకు బ్రాడ్కాస్ట్ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్, పి. శ్రీధర్ ఈశ్వర్, ఎస్ సౌజన్య, బివిఎల్ కె మనోహర్, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.
© APWJF All Rights Reserved.Design & Developed By