News

Home News

నెల్లూరు

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు
) మీడియా కమిషన్ ఏర్పాటు

హక్కుల దినోత్సవం(డిమాండ్ల డే) సందర్భంగా నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APWJF), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టులు అసోసియేషన్ (APBJA) ఆద్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి జే. ఉదయ భాస్కర్ ను కలసిన జర్నలిస్టులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని 1) జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు 2) మీడియా కమిషన్ ఏర్పాటు 3) జర్నలిస్టులకు పెన్షన్ 4) అక్రిడిటెషన్ కమిటీల్లో మీడియా కమిటీ ప్రతినిధులకు ప్రాతినిధ్యం 5) జర్నలిస్టు కమిటీలు ఏర్పాటు 6) మీడియా అకాడమీ బలోపేతం చేయడం 7) ప్రతి సంవత్సరం జర్నలిస్టులకు అవార్డులు అందజేయడం 8) జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత 9) బీమా సదుపాయం ఏర్పాటు 10) జర్నలిస్టులకు ఆరోగ్య బీమా 11) జర్నలిస్టులకు వృద్ధాశ్రమం ఏర్పాటు తదితర అంశాలపై వినతి పత్రం అంద చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోలగట్ల సుధాకర్, నగర అధ్యక్షులు భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టులు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మేడా శ్రీదర రెడ్డి, కార్యదర్శులు ఎం. విజయ కుమార్ రెడ్డి, మల్లికార్జున రావు,అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లా

దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీడబ�

దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
జర్నలిస్టుల డిమాండ్ డే సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల నియోజకవర్గ జిల్లా కేంద్రాలలో స్థానిక తహసీల్దారులు ఆర్డీవోలకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు వినతి పత్రాలు అందజేశారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో ఆర్డీవో శ్రీనివాసులు గారికి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు బి ప్రకాష్, ఏపీ బీజేఏ జిల్లా అధ్యక్షులు చల్లా జయ చంద్ర, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కేశవులు, బాలసుబ్రమణ్యం కోశాధికారి కృపానందరెడ్డి సంఘం సభ్యులు యాదవేందర్ రెడ్డి ఉమాశంకర్, మురళీకృష్ణ నాగరాజు, కుబేన్ద్రన్, మంజునాథ్, సత్యం ప్రసాద్, సురేందర్ రెడ్డి, విజయ్, ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో వైద్య పరీక్షలు సమస్యలపై కూటమి ప్రభుత్వంకు నివేదన సానుకూలంగా �

వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో వైద్య పరీక్షలు
సమస్యలపై కూటమి ప్రభుత్వంకు నివేదన
సానుకూలంగా స్పందించిన కలెక్టర్
విశాఖపట్నం, జూన్ 11.
విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హామీ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యూజెఎఫ్) ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం విశాఖపట్నం జిల్లా ఫెడరేషన్ యూనిట్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ను కలిసి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను ప్రభుత్వం కు తెలియ చేయాలి అని కోరుతూ 12 అంశాలు పై వినతి పత్రం సమర్పించారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా వర్కింగ్ జర్నలిస్టులకు వైద్య పరీక్షలు చేయించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఈ నెల 21వ తేదీన జరగనున్న యోగాంధ్ర కార్యక్రమం పూర్తయిన వెంటనే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటామన్నారు. చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని, త్వరలో ఏర్పాటు చేయనున్న అక్రెడిటేషన్ కమిటీలో ఎపిడబ్ల్యూజేఎఫ్, ఎపిబిజెఎ లకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు వీలుగా రాష్ట్రంలో హోం మంత్రి ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ, జిల్లాల్లో పోలీసు ఉన్నతాధి కారులతో కూడిన కమిటీలను తక్షణం ఏర్పాటు చేసి జర్నలిస్టులకు భద్రత కల్పించాలని కోరారు. మీడియా అకాడమీని బలోపేతం చేసి, ప్రతిభ కనబరిచిన జర్నలిస్టులకు అవార్డులు ఇవ్వాలన్నారు. జర్నలిస్టులకు కార్మిక భీమా, ఆరోగ్య బీమా సదుపాయం వర్తింపచేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. జర్నలిస్టులకు పింఛను సదుపాయం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా కార్యదర్శి జి శ్రీనివాస్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, కింతాడ మదన్,ఆంధ్రప్రదేశ్ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు విఎస్ జగన్ మోహన్, ఇతర ప్రతినిధులు కెవి శర్మ,పి రవిశంకర్,అరుణ్ భాస్కర్, రఫీ,బి అప్పల నాయుడు, కే సత్యనారాయణ,కె తులసీదాస్, టి కృష్ణమూర్తి, నగేష్, పి శ్రీనివాసులు నాయుడు, డిపి నాయుడు,జిఆర్ఎస్ రమేష్,రమణమూర్తి, పి శ్రీలత, బి రేణుక, జి సత్యనారాయణ, బి తేజ,శివ, రమేష్,వెంకటరమణ, ఫణి తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా

APWJF ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డే కార్యక్రమం

అనంతపురంలో జర్నలిస్టులు ఆందోళన

APWJF ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డే కార్యక్రమం

ఆక్రిడిటేషన్లు ,ఆరోగ్య భీమా, ఉచిత విద్య, పెన్షన్ వంటి డిమాండ్లు పరిష్కరించాలి


జిల్లాలో పని చేస్తున్న ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు 3సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇళ్ల నిర్మాణం, ఉద్యోగ భద్రత కల్పించాలని APWJF జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజినేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలపై ఇవాళ APWJF నాయకులతో కలిసి రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అన్ని పత్రికలు, టీవీ ఛానల్స్‌కు చెందిన జర్నలిస్టులు "డిమాండ్స్ డే లో భాగంగా జర్నలిస్టులు DRO కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం రెవెన్యూ అధికారి ద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు. ఈ సందజర్భంగా APWJF జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజినేయులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు జర్నలిస్టులు వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని.. ఎన్నికల ముందు ప్రతి పార్టీ జర్నలిస్టుల సమస్యలను పరిష్కారిస్తామని హామీలు ఇవ్వడం తప్ప.. ఎక్కడా నెరవేర్చింది లేదన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల ముందు కూడా కూటమి జర్నలిస్టులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల డిమాండ్స్ డే ను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో పని చేసే ప్రతి వర్కింగ్ జర్నలిస్టుగా ముందుగా ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఏడాది కాలంగా అక్రిడిటేషన్ లు కూడా మంజూరు చేయలేదన్నారు. అక్రిడిటేషన్లతో పాటు సంస్థల నుంచి గుర్తింపు కార్డులు, ఇంటి స్థలాలు, ఇళ్ల నిర్మాణం, ఆరోగ్య బీమా వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో APWJF దశల వారిగా ఉద్యమాలు చేస్తుందని రేపటి రామాంజినేయులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు జయప్రకాష్, నాగభూషణ్ , వేణుగోపాల్ , నాయుడు, శ్రీరాములు, సూర్య, రామాంజనేయులు, శ్రీనివాసులు, జగదీశ్, కేశవ, రవీంద్ర, ఉపేంద్ర, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు

దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాల......

చిత్తూరు

దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జర్నలిస్టుల డిమాండ్ డే సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల నియోజకవర్గ జిల్లా కేంద్రాలలో స్థానిక తహసీల్దారులు ఆర్డీవోలకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు వినతి పత్రాలు అందజేశారు జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో ఆర్డీవో శ్రీనివాసులు గారికి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు బి ప్రకాష్, ఏపీ బీజేఏ జిల్లా అధ్యక్షులు చల్లా జయ చంద్ర, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కేశవులు, బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు

Andhra Pradesh Working Journalists Federation (APWJF)

1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్‌ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్‌, పి. శ్రీధర్‌ ఈశ్వర్‌, ఎస్‌ సౌజన్య, బివిఎల్ కె మనోహర్‌, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.

Get In Touch

H. No. 40-15/1-30, SVBS Kamala,
B-1, First floor, Brundavan
colony, Labbipet,
Vijayawada - 10

generalsecretaryapwjf@gmail.com

+91 9866399883

© APWJF All Rights Reserved.Design & Developed By Gateway webs