News

Home News

ఎన్టీఆర్ జిల్లా

జర్నలిస్టుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందంజలో ఉంటుందని జర్నలిస్టుల ఇంటి స్థలాల కేటాయింపు సమస్యతో పాటు ఇతర సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఫెడరేషన్ ప్రతినిధి వర్గానికి హామీ ఇచ్చారు. జర్నలిస్టుల పెన్షన్ కేటాయింపుకు సంబంధించిన అవకాశాలను పరిశీలించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని ఆయన స్పష్టం చేశారు.
అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ జూన్ 11వ తేదీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్స్ డే పాటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని నుంచి మారుమూల మండల కేంద్రం వరకు జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రాలను ప్రభుత్వానికి అందజేశారు.
రాష్ట్ర రాజధానిలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధిని కలిసిన ఫెడరేషన్ ప్రతినిధి వర్గం సమస్యల గురించి వివరించి వినతి పత్రం అందజేశారు. ఒంగోలు, ధర్మవరంలలో మంత్రులు రవికుమార్ డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి, సత్య కుమార్ తో పాటు వివిధ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, డిఆర్ఓలు, మండల రెవెన్యూ అధికారులకు ఫెడరేషన్ ప్రతినిధులు వినతి పత్రాలను అందజేశారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టులకు పెన్షన్, అక్రిడిటేషన్ కమిటీ లో ఫెడరేషన్, ఏపీ బీజేఏలకు ప్రాతినిధ్యం, జర్నలిస్టుల వివిధ కమిటీల ఏర్పాటు, మీడియా అకాడమీ బలోపేతం చేయటం, జర్నలిస్టుల అవార్డులు, ఉద్యోగ భద్రత, కార్మిక భీమా సదుపాయం, జర్నలిస్టులకు వృద్ధాశ్రమం ఏర్పాటు తదితర అంశాలపై వినతి పత్రం అందజేశారు. వీటితోపాటు స్థానికంగా జర్నలిస్టుల సమస్యల గురించి ఆ వినతి పత్రంలో ప్రస్తావించారు.
ఎస్ వెంకట్రావు అధ్యక్షులు
జి ఆంజనేయులు
ప్రధాన కార్యదర్శి

తిరుపతి

జర్నలిస్టుల సమస్యలపై ఆర్డీవో ఏవో కు వినతి ....

ఆర్డీవో కార్యాలయం వద్ద జర్నలిస్టుల
సమస్యలపై ఆర్డీవో ఏవో కు వినతి
తిరుపతి టౌన్
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి ఆర్ డి ఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్, తిరుపతి అధ్యక్షులు వాణి మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న మూడు సెంట్ల భూమి అర్హులైన పేద జర్నలిస్టులకు ఇవ్వాలని కోరారు. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించి వారిపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులకు వేజ్ బోర్డు ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లో ఉండే జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా చిన్న పత్రికలకు అక్రిడేషన్ల కార్డుల సంఖ్య పెంచాలని కోరారు. రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు తమిళనాడు తరహాలో పెన్షన్ ఇవ్వాలని కోరారు. తర్వాత ఆర్డీవో కార్యాలయం పరిపాలన అధికారి ఝాన్సీ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఎస్ గౌస్, తులసి కుమార్, వెంకటేష్, శేఖర్, సుబ్బరాయుడు, జయపాల్, నరసింహులు, హనుమంత్ రెడ్డి, వరదరాజులు పాల్గొన్నారు

విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లా డిఆర్ఓకు వినతి పత్రం

ఎన్టీఆర్ జిల్లా

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ స్వర్ణలత గారికి వినతిపత్రం అందీస్తున్న ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె. కలిమిశ్రీ, ఎం. బి.నాథన్ తదితరులు

ఎన్టీఆర్ జిల్లా[ జగ్గయ్యపేట]

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలి

జగ్గయ్యపేట: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలి.
__ఏపిడబ్లూజెఎఫ్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయపు సిబ్బందికి వినతి పత్రం.
జగ్గయ్యపేట: అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, నూతన అక్రిడేషన్ కార్డ్స్ వెంటనే మంజూరు చేయాలనీ కోరుతూ ఏపిడబ్లూజెఎఫ్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయపు సీనియర్ అసిస్టెంట్ కె శ్రీదేవి కి వినతి పత్రం అందజేశారు. విలేకరుల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికీ తీసుకువెళ్లి పరిస్కారం చేయాలనీ కోరారు. ఈ సందర్బంగా ఏపిడబ్లూజెఎఫ్ నాయకులు జె వెంకటరావు మాట్లాడుతూ ఏంతో కాలం నుంచి జర్నలిస్టులుగా పని చేస్తున్న ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదని, అద్దె ఇళ్లలో ఉండలేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులకు మంజూరు చేయాలనీ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన అక్రిడేషన్ కార్డ్స్ పొడగింపు చేయడం వల్ల నూతనంగా చాలా మంది అర్హత ఉన్న కార్డ్స్ పొందలేని పరిస్థితి ఉందని, ప్రభుత్వం వెంటనే అక్రిడేషన్ కమిటీనీ ఏర్పాటు చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నూతనంగా మంజూరు చేయాలనీ కోరారు. ప్రజా సమస్యలపై వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న

Andhra Pradesh Working Journalists Federation (APWJF)

1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్‌ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్‌, పి. శ్రీధర్‌ ఈశ్వర్‌, ఎస్‌ సౌజన్య, బివిఎల్ కె మనోహర్‌, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.

Get In Touch

H. No. 40-15/1-30, SVBS Kamala,
B-1, First floor, Brundavan
colony, Labbipet,
Vijayawada - 10

generalsecretaryapwjf@gmail.com

+91 9866399883

© APWJF All Rights Reserved.Design & Developed By Gateway webs