News

Home News

ప్రకాశం జిల్లా

రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి వినతి పత్రాలు అందజేస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ నేతలు

చిత్తూరు జిల్లా[పుంగనూరు]

ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో డిమాండ్స్ డే సందర్భంగా వినతి పత్రం

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి డిమాండ్స్ డే సందర్భంగా వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షులు సతీష్, ప్రధాన కార్యదర్శి హిదాయతుల్లా కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

శ్రీ సత్యసాయి జిల్లా[ ధర్మవరం]

శ్రీ సత సమస్యల పైన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ వినతిపత్రం సమర్పిస్తున్న APWJF నాయకులు

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో జర్నలిస్టుల సమస్యల పైన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ వినతిపత్రం సమర్పిస్తున్న APWJF నాయకులు

19వ తారీఖున జరిగే మంత్రివర్గ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలపై కచ్చితంగా చర్చిస్తానని మంత్రి ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులకు హామీ ఇచ్చారు.

గుంటూరు

కార్మిక చట్టాలు పునరుద్ధరించాలి – కలెక్టరేట్ వద్ద APWJF–APBJA ఆధ్వర్యంలో జర్నలిస్టుల నిరసన.

కార్మిక చట్టాలు పునరుద్ధరించాలి – కలెక్టరేట్ వద్ద APWJF–APBJA ఆధ్వర్యంలో జర్నలిస్టుల నిరసన.

గుంటూరు:
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్మిక చట్టాలలో వర్కింగ్ జర్నలిస్టుల చట్టం–1955 మరియు వర్కింగ్ జర్నలిస్ట్ వేతనల చెల్లింపుల చట్టం–1958 ముఖ్యమైనవిగా జర్నలిస్టులకు సంబంధించి ఉన్నాయని,అవి యధాతథంగా కొనసాగించాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (APWJF) మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ (APBJA) డిమాండ్ చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూన్ 9వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు గుంటూరు కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ,జర్నలిస్టులకు ఉన్న హక్కులను కేంద్రం పునరుద్ధరించాలి.రద్దు చేసిన చట్టాలను మళ్లీ అమలు చేయాలి,అని కోరారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి,
భద్రతకు ఈ చట్టాలు కీలకం అని వాటిని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పట్నాల సాయికుమార్,ఎన్.జె. శామ్యూల్,ఎస్‌.ఎస్.యస్. జహీర్,చి.మణికుమార్, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.ఇదే విధంగా APBJA గుంటూరు జిల్లా అధ్యక్షుడు బోస్క సువర్ణ బాబు, జనరల్ కార్యదర్శి కేసంశెట్టి శ్రీనివాసరావు, బ్రహ్మం,దుర్గారెడ్డి, అయ్యప్ప,శ్రీనివాస్,నవీన్,శశి, హోసన్న ఇతర నేతలు పాల్గొన్నారు.

అనకాపల్లి

రద్దు చేసిన జర్నలిస్టుల చట్టాలను పునరుద్దరించాలి

రద్దు చేసిన జర్నలిస్టుల చట్టాలను పునరుద్దరించాలి

ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్

అనకాపల్లి : కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్టుల చట్టాలను తిరిగి పునరుద్దరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బి. వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం అనకాపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రద్దు చేసిన చట్టాలను పునరుద్ధరించాలని, జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జర్నలిస్టులకు వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ జర్నలిస్టులకు వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఒక పక్క పోరాటం చేస్తుంటే మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఈ చట్టాలను రద్దు చేయడం దారుణమని అన్నారు. ఈ చట్టాలను పునరుద్దరించాలంటూ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయని, ఈ భారీ ఆందోళన కార్యక్రమం లో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గోవాలని కోరారు. అలాగే ఈనెల 11 న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అయినప్పటికీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎటువంటి కృషి చేయలేదని, అక్రిడేషన్లు విషయంలో తీవ్ర జాప్యం, ఇళ్ల స్ధలాల విషయం లో నాన్చుడు ధోరణి తదితర అంశాలపై నల్లబ్యాడ్జీలు ధరించి అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు వినతిపత్రం అందచేసి నిరశన తెలుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు శశి, నాగ, యూనియన్ నాయకులు అజయ్, శేఖర్ , గణేష్, గంటా శీను, సురేష్, రామకృష్ణ, నాగు, కోన లక్ష్మణ, నాయుడు, షణ్ముఖ, నానాజీ, హరికృష్ణ, శ్రీను, అప్పారావు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Andhra Pradesh Working Journalists Federation (APWJF)

1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్‌ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్‌, పి. శ్రీధర్‌ ఈశ్వర్‌, ఎస్‌ సౌజన్య, బివిఎల్ కె మనోహర్‌, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.

Get In Touch

H. No. 40-15/1-30, SVBS Kamala,
B-1, First floor, Brundavan
colony, Labbipet,
Vijayawada - 10

generalsecretaryapwjf@gmail.com

+91 9866399883

© APWJF All Rights Reserved.Design & Developed By Gateway webs