News

Home News

ఏలూరు జిల్లా

జర్నలిస్ట్ ల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ సర్కలర్ .....

జర్నలిస్ట్ ల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ సర్కలర్ జారీ

ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. వెట్రిసెల్వి గారికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీడబ్ల్యుజేఎఫ్ నాయకులు

ఏలూరు,
ఏపీడబ్ల్యుజేఎఫ్ నాయకులు అడిగిన వెంటనే
జర్నలిస్ట్ ల సమస్య పై స్పందించి... ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ ల పిల్లలకు.... ప్రయివేటు, కార్పొరేట్ స్కూల్స్ లో విద్యనభ్యసిస్తోన్న వారికి స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ కల్పిస్తూ
సర్కలర్ జారీ చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. వెట్రిసెల్వి గారికి అలాగే జిల్లా విద్యాశాఖా అధికారి యం. వెంకట లక్ష్మమ్మ గారికి ఏపీడబ్ల్యుజేఎఫ్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు... గత ఏడాది అలాగే
ప్రస్తుత ఏడాది కూడా ఫీజు రాయితీ కల్పించాలని అడిగిన వెంటనే జర్నలిస్టుల సమస్య పై స్పందించిన తీరుపై ఏపీడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ జబీవుల్లా (జబీర్ ) ధన్యవాదాలు తెలిపారు.

శ్రీ సత్య సాయి జిల్లా

శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం లో సభ్యత కార్యక్రమo.....

శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం లో సభ్యత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న APWJF నాయకులు.

విశాఖపట్నం జిల్లా

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించండి
-- ఉచితంగా వైద్య పరీక్షలు చేయించండి

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించండి
-- ఉచితంగా వైద్య పరీక్షలు చేయించండి
-- డీఆర్‌వో భవానీ శంకర్‌కు జర్నలిస్టుల వినతి

విశాఖపట్నం, జూన్‌23: విశాఖ జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌, ఏపీ బ్రాడ్‌కాస్ట్, స్మాల్‌ అండ్‌ మీడియం న్యూస్‌ పేపర్స్‌ అసోసియేషన్ల అధ్వర్యంలో డీఆర్‌వో భవానీ శంకర్‌కు వినతిపత్రం సమర్పించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఆర్‌వోను జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ్‌లు కలుసుకొని ఇప్పటికే ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాలు అక్కడ జర్నలిస్టుల పిల్లలకు స్కూల్‌లో ఫీజు రాయితీపై ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని వివరించారు. అలాగే వినతిపత్రంతో పాటు ఆయా జిల్లాలు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను డీఆర్‌వోకి అందజేశారు. అక్కడి మాదిరిగానే విశాఖ జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు వంద శాతం రాయితీ కల్పించాలని కోరారు. అలాగే జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కొన్ని స్కూల్స్‌ ఫీజు రాయితీ నిరాకరిస్తున్నాయని వీరు తెలియజేశారు. జర్నలిస్టుల వినతిపై డీఆర్‌వో సానుకూలంగా స్పందించారు. అక్కడే ఉన్న డీఈవో ప్రేమ కుమార్‌ను పిలిచి ఆయా ఉత్తర్వులు పరిశీలించి తక్షణమే జిల్లా కలెక్టర్‌కు ఫైల్‌ పంపాలని ఆదేశించారు. వీలైనంత త్వరలో ఇందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే జర్నలిస్టులకు గతేడాది మాదిరిగానే ఉచితంగా వైద్య పరీక్షలు చేయించాలని కోరగా, ఈ విషయం కలెక్టర్‌ దృష్టిలో ఉందని, తదుపరి చర్యలు తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ విశాఖ జిల్లా కార్యదర్శి జీ. శ్రీనివాసరావు,డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ ఎ.సాంబశివరావు, బ్రాడ్‌ కాస్ట్ విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఇరోతి ఈశ్వరరావు, కింతాడ మదన్‌,ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు బండారు శివప్రసాద్‌,త్రినాధరావు, రాజశేఖర్‌,పిల్లా నగేష్‌ బాబు, పి.కామన్న తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం జిల్లా

మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ పల్లా సింహాచలం మృతి విచారకరం.
:- జాతీయ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు,ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు,కార్యదర్శిలు నారాయణ, శ్రీనివాసరావు..

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి తండ్రి విశాఖ
మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ పల్లా సింహాచలం మృతి విచారకరం.
:- జాతీయ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు,ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు,కార్యదర్శిలు నారాయణ, శ్రీనివాసరావు..
        **"""**
ఉత్తరాంధ్ర జిల్లా నాయకుడు, కార్మికుల పక్షపాతి, మాజీ శాసనసభ్యులు శ్రీ పల్లా సింహాచలం మృతి ఉత్తరాంధ్ర జిల్లా కు తీరని లోటని
       స్వర్గీయ పల్లా సింహాచలం కుమారులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,స్వర్గీయ పల్లా సింహాచలం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పోతు మహంతి నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు, ఈరోతి ఈశ్వరరావు,కార్యదర్శి మదన్. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విశాఖ జిల్లా కార్మిక లోకం ఒక గొప్ప కార్మిక నాయకున్ని కోల్పోయిందని పేర్కొంటూ,ఒకవైపు కార్మికులకు న్యాయం కోసం పోరాటాలు చేస్తూ, మరోవైపు శాసనసభ్యుగా నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేసిన స్వర్గీయ పల్లా సింహాచలం గారు ప్రస్తుత తరానికి మార్గదర్శకులని కొనియాడారు.   ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ స్థానిక నాయకత్వం కోసం క్రియాశీలకంగా పోరాడిన స్వర్గీయ పల్లా సింహచలం గారిని ఉత్తరాంధ ప్రజలు మదిలో దాచుకుంటారని పేర్కొంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖ జిల్లా,ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ తరఫున తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు...

విశాఖపట్నం జిల్లా

విశాఖ జిల్లా సాక్షి రిపోర్టర్ రామకృష్ణకు వాళ్ళు నడిపించిన ఎపిడబ్ల్యుఎఫ్ యూనిట్

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సభ్యుడు గాజువాక నియోజకవర్గం,అక్కిరెడ్దిపాలెం సాక్షి రామకృష్ణ మృతి పట్ల ఘనంగా నివాళులు అర్పించిన జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు, జిల్లా జనరల్ సెక్రెటరీ జి.శ్రీనివాసరావు, ఏపీ బీజేఏ జిల్లా సెక్రెటరీ కె.మదన్, స్మాల్ అండ్ మీడియం అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ రాజశేఖర్
వారి కుటుంబ సభ్యులు కు ప్రగాఢ సానుభూతి తెలిపి గంట్ల శ్రీను బాబు, వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందచేశారు..

Andhra Pradesh Working Journalists Federation (APWJF)

1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్‌ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్‌, పి. శ్రీధర్‌ ఈశ్వర్‌, ఎస్‌ సౌజన్య, బివిఎల్ కె మనోహర్‌, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.

Get In Touch

H. No. 40-15/1-30, SVBS Kamala,
B-1, First floor, Brundavan
colony, Labbipet,
Vijayawada - 10

generalsecretaryapwjf@gmail.com

+91 9866399883

© APWJF All Rights Reserved.Design & Developed By Gateway webs