ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం:
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిమాండ్స్ డే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APWJF) పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నాయకుల ఆదేశాల మేరకు డిమాండ్స్ పత్రాన్ని డిప్యూటీ తహసిల్దార్ పి విజయ్ కుమార్ కు డిమాండ్ పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీసం సురేష్ బాబు ( ప్రజాశక్తి) చింతకాయల రాంబాబు( సన్ ఫ్లవర్ న్యూస్ ) మంతెన శ్రీనివాస్ ( ప్రభా న్యూస్ ) కూరపాటి ప్రకాష్ ( మంజీరా గళం ) ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలి
ఏపిడబ్లూజెఎఫ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంతహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, నూతన అక్రిడేషన్ కార్డ్స్ వెంటనే మంజూరు చేయాలనీ కోరుతూ ఏపిడబ్లూజెఎఫ్ మైలవరం నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా జరిగింది. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అక్రిడేషన్ కార్డ్స్ మంజూరు చేయాలనీ జర్నలిస్టులు నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తాహసిల్దార్ సాయి మహేష్ కు అందజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ దృష్టికీ తీసుకువెళ్లి సమస్యను పరిస్కారం చేయాలనీ ఆయనను కోరారు. ఈ సందర్బంగా ఏపిడబ్లూజెఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఏంతో కాలం నుంచి జర్నలిస్టులుగా పని చేస్తున్న ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదని, అద్దె ఇళ్లలో ఉండలేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులకు మంజూరు చేయాలనీ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన అక్రిడేషన్ కార్డ్స్ పొడగింపు చేయడం వల్ల నూతనంగా చాలా మంది అర్హత ఉన్న కార్డ్స్ పొందలేని పరిస్థితి ఉందని
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై వినతి
ప్రజాశక్తి-గంపలగూడెం: దీర్ఘకాలికంగా పడకేసిన జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, బుధవారం ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండల తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించినట్లు ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధి జి అంజయ్య తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. జర్నలిస్టుల డిమాండ్స్ డే ని పురస్కరించుకొని ఈ వెన్నతిని సమర్పించినట్లు తెలిపారు.గత ప్రభుత్వం జర్నలిస్టులకు మూడు సెంట్లు ఇళ్ల స్థలాలతోపాటు పలు సమస్యలను ఆ వినతిలో పేర్కొన్నట్లు వివరించారు. కార్యక్రమంలో రాయల ఆంజనేయ మూర్తి తదితరులు పాల్గొన్నారు
జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి..ఏపీడబ్ల్యూజేఎఫ్
ప్రజాశక్తి -నందిగామ నందిగామ రెవిన్యూ డివిజన్ పరిధిలో కొంతమంది జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా నాయకులు ఆకుల వెంకటనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఎపీ డబ్ల్యూ జే ఎఫ్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో వచ్చి నందిగామ ఆర్డీవో కే బాలకృష్ణను కలిసి జర్నలిస్టు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా నాయకులు ఆకుల వెంకటనారాయణ మాట్లాడుతూ నందిగామలో కొంతమంది విలేకరులపై ప్రభుత్వం వదిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నందిగామలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వంలో తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. జర్నలిస్టు రక్షణ కొరకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రిడేషన్ కమిటీలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీ .ీబీజేఏలకు ప్రాతినిధ్యం కల్పించిందని తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
1980 దశకం వరకు బ్రాడ్కాస్ట్ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్, పి. శ్రీధర్ ఈశ్వర్, ఎస్ సౌజన్య, బివిఎల్ కె మనోహర్, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.
© APWJF All Rights Reserved.Design & Developed By