News

Home News

కర్నూలు జిల్లా

జర్నలిస్టుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి.
ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలి.

జర్నలిస్టుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి.
ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలి.
అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇవ్వాలి.
వివిధ డిమాండ్లతో ఇంచార్జ్ డిఆర్వో వెంకటేశ్వర్లు కు వినతి.


జర్నలిస్టుల సమస్యలు వారి న్యాయమైన డిమాండ్లు పరిస్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం డిమాండ్ల డే పురస్కరించుకుని ఇంచార్జ్ డిఆర్వో వెంకటేశ్వర్లు కు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ నాగేంద్ర,జిల్లా నాయకులు సునీల్ కుమార్,నగర అధ్యక్షులు శివ శంకర్, నగర ప్రధాన కార్యదర్శి ఎర్రమల,ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు జమ్మన్న,భీమేష్ లు జర్నలిస్టుల డిమాండ్ల వినతిని అందించారు.ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ నాగేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిస్కారం కొరకు డిమాండ్ల డే నిర్వహించామని జిల్లా వ్యాప్తంగా అన్నీ మండల ,నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. జర్నలిస్టులకు ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు కల నెరవేరలేదని నేటికి అద్దె ఇళ్లల్లో ఉండే జర్నలిస్టులు జీవనం కొనసాగిస్తున్నారన్నారు.కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే జర్నలిస్టులకు ఇంటి స్థలం తో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే అక్రిడేషన్ కాలపరిమితి ముగిసిన రెన్యూవల్ పేరుతో కొనసాగిస్తున్నారని ఇప్పటికైనా పూర్తి స్థాయిలో అందరికి అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలకు అక్రిడేషన్ కమిటీలో ప్రతినిత్యం కల్పించాలని కోరారు.జర్నలిస్టుల పై రోజు రోజుకు పెరుగుతున్న దాడులను నియంత్రించేలా జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు తక్షణమే పరిస్కారం చేయాలని కోరారు. ఇంచార్జ్ డిఆర్వో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉన్నతాధికారులకు నివేదించి తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఏలూరు జిల్లా[చింతలపూడి]

APWJF చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం చింతలపూడి లో చింతలపూడి ఎం. ఎల్. ఎ. సొంగా రోషన్ కుమార్ గారిని వారి కార్యాలయంలో కలిసి తమ సమస్యల పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 1) జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు 2) మీడియా కమిషన్ ఏర్పాటు 3) జర్నలిస్టులకు పెన్షన్ 4) అక్రిడిటెషన్ కమిటీల్లో మీడియా కమిటీ ప్రతినిధులకు ప్రాతినిధ్యం 5) జర్నలిస్టు కమిటీలు ఏర్పాటు 6) మీడియా అకాడమీ బలోపేతం చేయడం 7) ప్రతి సంవత్సరం జర్నలిస్టులకు అవార్డులు అందజేయడం 8) జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత 9) భీమా సదుపాయం ఏర్పాటు 10) జర్నలిస్టులకు ఆరోగ్య భీమా 11) జర్నలిస్టులకు వృద్ధాశ్రమం ఏర్పాటు తదితర అంశాలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో APWJF ఏలూరు జిల్లా కోశాధికారి కె. నాగ చిన్నారావు, సంయుక్త కార్యదర్శి ఎం. రవి, కె. రజనీకాంత్, టి. సంజయ్, టి. బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రద్ధ చూపాలి.....

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రద్ధ చూపాలి. గుంటూరులో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APWJF) – ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌ కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ (APBJA) గుంటూరు జిల్లా డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ కు వినతి.

రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే శ్రద్ధ చూపాలని, వారి సంక్షేమానికి గట్టి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APUWF), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టులు అసోసియేషన్ (APBJA) గుంటూరు జిల్లా శాఖలు కోరాయి. ఈ మేరకు 11-06-2025 తేదీన గుంటూరు జిల్లా రెవెన్యూ ఆఫీసర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు, నూతన అక్రిడిటేషన్ కార్డులు త్వరితగతిన జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, కార్మిక బీమా వంటి మౌలిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్నాల సాయికుమార్, మహేష్, శ్యామేల్, సుధాకర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌ కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు బోస్క సువర్ణ బాబు, ప్రధాన కార్యదర్శి కేసంశెట్టి శ్రీనివాసరావు, దుర్గారెడ్డి, శ్రీనివాస్,నవీన్, రవి, అయ్యప్ప,సాగర్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెనాలి

జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి
తెనాలి:
రాష్ట్రం లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కారం కోసం ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని, జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, ఆంధ్ర ప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ తెనాలి శాఖలు ప్రభుత్వాన్ని కోరాయి. ఆయా జర్నలిస్ట్ సంఘాల రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనా అధికారి శ్రీధర్ బాబు
సంఘ నేతలు, సభ్యులు బుధవారం వినతి పత్రం అందజేశారు.
తెనాలి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. జహీర్, జిల్లా అధ్యక్షులు కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, నూతన అక్రిడిటేషన్ కార్డులు అందజేయాలని, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, కార్మిక బీమా కల్పించాలన్నారు. నాయకులు అంబటి శ్యామ్ సాగర్, అచ్యుత సాంబశివరావు లు
మాట్లాడుతూ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని,
మీడియా అకాడెమీ ను బలోపేతం చేయాలని,పెన్క్షన్ సౌకర్యాలను జర్నలిస్టులకు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఉన్నం భూషణం, మేకల సుబ్బారావు, వి.వి. నాయుడు, సభ్యులు పాల్గొన్నారు.

హనుమంతునిపాడు మండల

రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హనుమంతునిపాడు మండల తాసిల్దార్ నాగుల్ మీరాకు వినతి పత్రం అందజేస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ కమిటీ నేతలు

Andhra Pradesh Working Journalists Federation (APWJF)

1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్‌ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్‌, పి. శ్రీధర్‌ ఈశ్వర్‌, ఎస్‌ సౌజన్య, బివిఎల్ కె మనోహర్‌, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.

Get In Touch

H. No. 40-15/1-30, SVBS Kamala,
B-1, First floor, Brundavan
colony, Labbipet,
Vijayawada - 10

generalsecretaryapwjf@gmail.com

+91 9866399883

© APWJF All Rights Reserved.Design & Developed By Gateway webs