News

Home News

అనకాపల్లి జిల్లా

అనకాపల్లి జిల్లా' నర్సీపట్నం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం అందిస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు

గుంటూరు జిల్లా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సమస్యలపై, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం .....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సమస్యలపై, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం అందజేస్తున్న సందర్భంగా, సోమవారం ఉదయం గుంటూరు జిల్లా కలెక్టరేట్ లోని శంకరన్ హాల్ లో, పిజిఆర్ఎస్ నిర్వహిస్తున్న జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, కు గుంటూరుజిల్లా APWJF,APBJA, అసోసియేషన్ల ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భాగంగా APWJF గుంటూరు జిల్లా జనరల్ సెక్రెటరీ పట్నాల సాయికుమార్,వరదల మహేష్ APBJA గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ బోస్క సువర్ణ బాబు,జనరల్ సెక్రటరీ కేశంశెట్టి శ్రీనివాస,రవి గుంటూరు నగర అధ్యక్షులు ప్రమోద్ జనరల్ సెక్రెటరీ షణ్ముఖ,శ్యామ్యూల్ వంశీ,శ్రీనివాస్,వెంకట సాయి,తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల జిల్లా

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల జిల్లా కన్వీనర్ జి. మద్దయ్య యాదవ్ ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మౌలాలి, నంద్యాల డివిజన్ అధ్యక్షులు మాదాల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం జర్నలిస్టుల డిమాండ్స్ డే ను పురస్కరించుకొని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలని, అక్రిడేషన్లు తక్షణమే ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అక్రిడిటేషన్ల జారీకి వీలుగా కొత్త జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఇక్బాల్ హుస్సేన్, సుబ్బరాయుడు ,నరసింహారెడ్డి, బేతంచర్ల సుబ్బరాయుడు, రాకేష్, కిషోర్, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా

శ్రీ సత్యసాయి జిల్లా

పెనుకొండ మండలం తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పిస్తున్న APWJF నాయకులు.

పశ్చిమగోదావరి జిల్లా

భీమవరంలోజర్నలిస్టుల డిమాండ్స్ వినతి పత్రాన్ని అందజేస్తున్న

జర్నలిస్టు సమస్యలు పరిష్కరించాలి
వి వి ఆర్ ఎం 1 భీమవరంలో జెసికి వినతిపత్రం అందజేస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు
ప్రజాశక్తి - వీరవాసరం

ప్రజలకు ప్రభుత్వాలకు వారిదిగా ఉంటున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపిడబ్ల్యూజేఎఫ్ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు గుండా రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జర్నలిస్టుల డిమాండ్స్ డే ను పురస్కరించుకుని భీమవరం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గుండా రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు. జర్నలిస్టుల అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్న ప్రభుత్వ హామీలు నీటిపై రాతలుగా మిగిలిపోయాయి అన్నారు. తక్షణమే అర్హురైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో జర్నలిస్టుల యూనియన్లను అక్రిడేషన్ కమిటీలోకి తీసుకొని ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా అకాడమీని బలోపేతం చేయాలన్నారు జర్నలిస్టులందరికీ ప్రమాద బీమా కల్పించాలన్నారు జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంతపురం నాని, ఉండ్రు నరేష్, మోహన్ రావు మోహనరావు, గొట్టేటి శ్రీనివాసరావు, నెల్సన్ ,సీమకుర్తి బాలాజీ, మల్లుల జై కృష్ణ, దొంగ సత్తిబాబు ,అంజిబాబు,తదితరులు పాల్గొన్నారు

Andhra Pradesh Working Journalists Federation (APWJF)

1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్‌ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్‌, పి. శ్రీధర్‌ ఈశ్వర్‌, ఎస్‌ సౌజన్య, బివిఎల్ కె మనోహర్‌, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.

Get In Touch

H. No. 40-15/1-30, SVBS Kamala,
B-1, First floor, Brundavan
colony, Labbipet,
Vijayawada - 10

generalsecretaryapwjf@gmail.com

+91 9866399883

© APWJF All Rights Reserved.Design & Developed By Gateway webs