News

Home News

గుంటూరు

జర్నలిస్టులకు రైల్వే పాస్‌లు పునరుద్ధరించాలి: కేంద్ర మంత్రిని కోరిన APWJF....

జర్నలిస్టులకు రైల్వే పాస్‌లు పునరుద్ధరించాలి: కేంద్ర మంత్రిని కోరిన జర్నలిస్టు సంఘాలు

కోవిడ్ సమయంలో నిలిపివేసిన రైల్వే రాయితీ పాస్‌లను జర్నలిస్టులకు తిరిగి మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్( APWJF ) మరియు బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ( APBJA ) సంయుక్తంగా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి గుంటూరు జిల్లా క్యాంప్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారూ. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, " రైల్వే పాస్‌ల విషయాన్ని తప్పకుండా పార్లమెంటులో ప్రస్తావిస్తాను . నిలిపివేసిన రాయితీ పాస్‌లు మళ్లీ అమలులోకి రావడానికి నా వంతు కృషి చేస్తాను," అని హామీ ఇచ్చారు. వినతిపత్రంలో, గ్రామీణ మరియు ప్రాంతీయ స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు రైలు ప్రయాణం ఎంతగానో అవసరమని, రాయితీ పాస్‌ల పునరుద్ధరణ జర్నలిస్టుల కోసం ఎంతగానో ఉపయోగపడుతుందనీ పేర్కొన్నారు. ప్రజలకు విశ్వసనీయ సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సౌకర్యార్థం పాస్‌ల మళ్లీ ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు బోస్క సువర్ణబాబు, జనరల్ సెక్రటరీ కేశంసెట్టి శ్రీనివాస్, మోపర్తి సువర్ణరాజు, యదనపుడి ఆరుద్ర, గాజుల బ్రహ్మం,బిరుదుల రాజేంద్ర, రవి తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా

రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 4 జర్నలిస్టుల డిమాండ్స్ డే విజయవంతంగా నిర్వహించారు.....
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కార్యక్రమం జరిగింది. ...

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నీ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 4 జర్నలిస్టుల డిమాండ్స్ డే విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కార్యక్రమం జరిగింది. కొన్ని జిల్లాల్లో పర్యటనలో ఉన్న మంత్రులకు, శాసనసభ్యులకు వినతి పత్రాలు అందజేశారు. అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించారు. వర్కింగ్ జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆ వినతి పత్రంలో ప్రస్తావించారు.
జర్నలిస్టుల ఇంటి స్థలాల కేటాయింపు, పెన్షన్ చెల్లింపు, అక్రిడిటేషన్ల జారీకి వీలుగా కొత్త జీవో తీసుకురావడం, మీడియాలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేసేందుకు వీలుగా మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టుల అవార్డులను ప్రధానం, రాష్ట్ర కేంద్రంలో వృద్ధ జర్నలిస్టుల కోసం ఓల్డ్ ఏజ్ హోం నిర్మాణం తదితర అంశాలపై ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆ వినతి పత్రంలో కోరింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా శాఖలకు ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ వెంకట్రావు ఆంజనేయులు అభినందనలు తెలియజేశారు.

ఎస్ వెంకట్రావు అధ్యక్షులు
జి ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి

అల్లూరి సీతారామరాజు జిల్లా

అల్లూరి సీతారామరాజు జిల్లా

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో పాత్రికేయులు ముందు వరుసలో ఉంటున్నారని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం పాడేరు విచ్చేసిన మంత్రి మనోహర్ ను కలసి రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం నిమిత్తం APWJF, APBJA జిల్లా నాయకులు, జర్నలిస్ట్ లు వినతి పత్రం అందజేశారు. పాత్రికేయుల సమస్యల పరిస్కారానికై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.

విజయనగరం జిల్లా

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 16 చోట్ల వినతి పత్రాలు

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 16 చోట్ల వినతి పత్రాలు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జర్నలిస్టు డిమాండ్స్ డే కార్యక్రమం విజయనగరం జిల్లా కేంద్రం తో పాటు 10 మండలాల్లోనూ, వినతి పత్రాలు అందజేసినట్టు ఇప్పటివరకు సమాచారం అందింది. విజయనగరం జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలత కలెక్టరేట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద తమ డిమాండ్ అని పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. మీడియాతో మాట్లాడిన అనంతరం కలెక్టర్ ఆడిటోరియంలోని నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్థానిక కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టిలో పెడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జర్నలిస్టులు ఒకంత ఉత్సాహంతోనే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు.

ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష గారికి వినతి పత్రం .....

ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష గారికి వినతి పత్రం సమర్పించి, సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు sv బ్రహ్మం, వి భక్తవత్సలం,, ఎల్ రాజు తిరుపతిరెడ్డి,, M C A అధ్యక్షుడు వి. నాగేశ్వరరావు, ప్రజాశక్తి ఎడిషన్ ఇంచార్జ్ తారక రామారావు,, ఎస్ సురేష్ కుమార్, ఈనాడు శ్రీను, తదితరులు

Andhra Pradesh Working Journalists Federation (APWJF)

1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్‌ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్‌, పి. శ్రీధర్‌ ఈశ్వర్‌, ఎస్‌ సౌజన్య, బివిఎల్ కె మనోహర్‌, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.

Get In Touch

H. No. 40-15/1-30, SVBS Kamala,
B-1, First floor, Brundavan
colony, Labbipet,
Vijayawada - 10

generalsecretaryapwjf@gmail.com

+91 9866399883

© APWJF All Rights Reserved.Design & Developed By Gateway webs