News

Home News

కర్నూలు

జర్నలిస్టుల చట్టాలను పునరుద్ధరించాలి.
ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీల తో ధర్నా.

జర్నలిస్టుల చట్టాలను పునరుద్ధరించాలి.
ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీల తో ధర్నా.
జర్నలిస్టులకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలి.
స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కు వినతి.


కేంద్రప్రభుత్వం 44 కార్మిక చట్టాల రద్దు చేసిన చట్టాల్లో జర్నలిస్టులకు సంబంధించిన రెండు చట్టాలు వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతనాల చెల్లింపు చట్టం 1958 రద్దు మానుకోవాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, రాష్ట్ర నాయకులు గోరంట్లప్ప, కేబి శ్రీనివాసులు,జిల్లా కన్వీనర్ నాగేంద్ర, ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు హుస్సేన్, సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గుప్తా,వీడియో జర్నలిస్ట్ రాష్ట్ర నాయకులు హుస్సేన్ డిమాండ్ చేశారు.సోమవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్షుడు శివ శంకర్ అధ్యక్షత న సోమవారం నల్లబ్యాడ్జీలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ జర్నలిస్ట్ చట్టాలు రద్దు చేయడం మనుకోవాలని రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ధర్నాలకు పిలుపునిచ్చారన్నారు. జర్నలిస్ట్ లకు జరుగుతున్న దాడులకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని పలుమార్లు కోరుతున్నా నేటికి వాటి ఊసు లేదు. కానీ ఉన్నటువంటి చట్టాలను రద్దు పరచడం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి సరైంది కాదన్నారు.సమాజంలో జర్నలిస్టుల పాత్ర గుర్తించి రద్దు చేసిన రెండు చట్టాలను పునరుద్ధరించాలని కోరుతున్నామన్నారు.కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలు చేస్తున్న కేంద్రం కార్మికుల గొంతును నొక్కుతూ చట్టాలను రద్దు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.ఇప్పటికైనా కార్మికులను ఆదుకోవాలని ,జర్మలిస్టుల చట్టాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా జర్నలిస్టుల ఐక్యతతో మరింత తీవ్రతరంచేస్తామన్నారు.అనంతరం స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కు వినతిని అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు సునీల్ కుమార్, నగర ప్రధాన కార్యదర్శి ఎర్రమల, ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వడ్డే శ్రీనివాసులు, సీనియర్ నాయకులు రాజశేఖర్ నాయుడు,నగర ఉపాధ్యక్షుడు బాబు,నాయకులు చెన్నయ్య,అనిల్,మురళి,చంద్రశేఖర్, లక్ష్మయ్య,జర్మలిస్టులు పాల్గొన్నారు.

విజయనగరం

వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను పునరుద్ధరించాలి
కలెక్టరేట్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన

వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను పునరుద్ధరించాలి

కలెక్టరేట్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన

విజయనగరం జూన్ 9:
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్ట్ చట్టాలు 1995, 1998 చట్టాలను పునరుద్ధరించాలని, వృత్తి ప్రమాణాలను, వేజ్ బోర్డు చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలోన స్థానిక కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. చట్టాల రద్దు పై కేంద్ర వైఖరిని నిరసిస్తూ పెద్దపెటున నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రమేష్ నాయుడు మాట్లాతూ వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు కాపాడేందుకు, వేతనాల చెల్లింపుకు, ఇతర సదుపాయాలకు, వేతన బోర్డుల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై ఈ చట్టాలు వర్కింగ్ జర్నలిస్టులకు ఏర్పాటును అందించే 1995, 1998 చట్టాలను రద్దు చేయడం దుర్మార్గం అని అన్నారు. ఈ చట్టాల రద్దు వల్ల జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలకు విఘాతం కలగడంతో పాటు వేతన చెల్లింపులకు సంబంధించిన అంశాలు వస్తావనకు రాకుండా పోతాయన్నారు. ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్టులు యాజమాన్యాల నుంచి చట్టబద్ధమైన రక్షణ లేకపోవడంతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఉన్న ఈ రెండు చట్టాలను తిరిగి పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ కోరుతోందన్నారు. మొత్తం మీడియాను ఒకే చట్ట పరిధిలోకి తెచ్చే విధంగా సరికొత్త చట్టాలు రూపొందించాల్సింది పోయి ఉన్న చట్టాలను రద్దు చేయడం ఎంత మాత్రం సరైన కాదని కాదన్నారు. రాష్ట్రవ్యాప్త ఎరుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. మురళి శంకర్రావు పత్తివాడ అప్పారావు బి.ప్రసాదరావు, గొర్లె సూరిబాబు తదితరులు పాల్గొన్నారు

చిత్తూరు

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ పిలుపుమేరకు జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలోని మహ


ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ పిలుపుమేరకు జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు బెంగళూరు ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాను ఉద్దేశించి ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కవర కుంట్ల జయరాజ్ మాట్లాడుతూ
వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతన చెల్లింపు చట్టం 1958.
వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు కాపాడేందుకు జర్నలిస్ట్ లిస్టులు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి ప్రజా సం గాలు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీ బీజేఏ జిల్లా అధ్యక్షులు చల్లా జయచంద్ర, ప్రధాన కార్యదర్శి నీరజాక్షలు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను పునరుద్ధరించాలి

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపుమేరకు జూన్ 9వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా

కార్మిక చట్టాల రద్దులో భాగంగా వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతనాలు చెల్లింపు చట్టం 1958 లను రద్దు చేయడానికి నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపుమేరకు జూన్ 9వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి.
శ్రీకాకుళం జిల్లా మొదలు విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లా వరకు అన్నిచోట్ల వివిధ రూపాలలో ఈ ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. జిల్లా కేంద్రాలలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేయడం, ధర్నాలు, ప్రదర్శనలు చేపట్టి వర్కింగ్ జర్నలిస్టుల చట్టాల రద్దును నిరసిస్తూ ఆందోళన చేశారు. ఆ చట్టాలను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎస్ వెంకట్రావు అధ్యక్షులు
జి ఆంజనేయులు
ప్రధాన కార్యదర్శి

విశాఖ

70 ఏళ్ల తర్వాత రద్దు చేయడం దారుణం.
వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నలబ్యాడ్జీలతో శాంతి యుత నిరసన.

వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలను కేంద్రం పునరుద్ధరించాల్సిందే
.
70 ఏళ్ల తర్వాత రద్దు చేయడం దారుణం.

వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నలబ్యాడ్జీలతో శాంతి యుత నిరసన.

కలెక్టరేట్... జూన్ 9

దేశవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన రెండు చట్టాలను కేంద్రం రద్దు చేయడం తగదని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు. పి నారాయణలు అన్నారు. ఆయా రెండు చట్టాలు రద్దును నిరసిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వర్కింగ్ జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో శాంతియుత నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీను బాబు, పి..నారాయణలు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన చట్టం 1955లో కేంద్రం అమల్లోకి తేవడం జరిగిందన్నారు. అలాగే వేతనాలు చెల్లింపునకు సంబంధించిన చట్టం 1958 నుంచి అమలు చేయడం జరిగిందన్నారు. మరి 70 ఏళ్ల తర్వాత ఈ రెండు చట్టాలు రద్దు చేయడం వల్ల జర్నలిస్టులకు తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. కాబట్టి కేంద్రం రద్దు చేసిన ఈ రెండు చట్టాలను జర్నలిస్ట్ ల పరిస్థితులు దృష్టి లో ఉంచుకొని తక్షణమే పునరుద్ధరించాలని వీరు డిమాండ్ చేశారు. ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్టుల పరిస్థితి దయనీయంగా మారిందని వీరు అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో సంక్షేమం కొరవడిందని,అలాగే ఉద్యోగ భద్రతతో పాటు వేతనాలు చెల్లింపులు,దాడుల నియంత్రణకు సంబంధించి సరైన చట్టాలు లేవని అందువల్లే మీడియా కమిషన్ ఏర్పాటు ను తాము ఎప్పటినుంచో స్వాగతిస్తున్నామన్నారు. వీటితోపాటు అటాక్స్ కమిటీలు,ఇతర ప్రభుత్వ కమిటీల్లో కూడా జర్నలిస్టుల సంఘాలకు విధిగా ప్రాతినిధ్యం కల్పించాల్సిందేనన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కార్యదర్శి జి. శ్రీనివాస్ రావు,బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల జిల్లా అధ్యక్షులు ఇరోతి ఈశ్వర్ రావు కార్యదర్శి కె. మదన్. చిన్న మధ్య తరహో పత్రికల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్, జర్నలిస్టు నేతలు వి. శ్రీనివాస్ రావు, కృష్ణ మూర్తి నాయుడు, శ్రీనివాస్ నాయుడు, కామన్న, కేవీ శర్మ, చక్రి,,.నాయుడు ,సత్య నారాయణ. నగేష్ బాబు.. శ్రీ లత, మాధవి గౌతమ్,వినయ్, శివ,పాల్గొన్నారు..

Andhra Pradesh Working Journalists Federation (APWJF)

1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్‌ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్‌, పి. శ్రీధర్‌ ఈశ్వర్‌, ఎస్‌ సౌజన్య, బివిఎల్ కె మనోహర్‌, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.

Get In Touch

H. No. 40-15/1-30, SVBS Kamala,
B-1, First floor, Brundavan
colony, Labbipet,
Vijayawada - 10

generalsecretaryapwjf@gmail.com

+91 9866399883

© APWJF All Rights Reserved.Design & Developed By Gateway webs