కొమరాడలో తాహసిల్దార్ సత్యనారాయణ కు విలేకరులు వినతిపత్రం అందజేత
పార్వతీపురం మండలం జిల్లా భామిని డిప్యూటీ తహసీల్దార్ శంకర్ రాయుడికి అందజేయడం జరిగింది
పార్వతీపురం జిల్లా కురుపాం మండల తాసిల్దార్ కు ఏపీడబ్ల్యుజె ఎఫ్ వినతి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలని, అక్రిడేషన్లు తక్షణమే ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు
యూనియన్లకు అతీతంగా ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకు రాయితీ
- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం
* డిమాండ్లను పరిష్కరించాలని కలెక్టర్ కు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు వినతి
చిత్తూరు, ఆగస్టు 4 : యూనియన్లుకు అతీతంగా అక్రిడిటేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టు పిల్లలందరికీ ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజు రాయితీ వర్తిస్తుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. జర్నలిస్ట్ డిమాండ్ డే ను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్ ) చిత్తూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు బీ ప్రకాష్ కలెక్టర్ తో మాట్లాడుతూ .... చిత్తూరు నగరంలోని ఒక జర్నలిస్ట్ యూనియన్ సభ్యుల పిల్లలకు మాత్రమే ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు రాయితీ వర్తిస్తుందని ప్రచారం జరుగుతోందన్నారు. అన్ని యూనియన్ల సభ్యుల పిల్లలకు రాయితీ వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అదే విధంగా అర్హులైన ప్రతి ఒక జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ అందేలా చూడాలని, 3 సెంట్ల మేర ఇళ్ల స్థలాలను కేటాయించాలని, జర్నలిస్టులపై దాడులను నివారించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, వృద్ధ జర్నలిస్టుల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ యూనియన్లతో నిమిత్తం లేకుండా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టు పిల్లలందరికీ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు రాయితీ వర్తిస్తుందని, జర్నలిస్టులపై దాడులు చేసే వారి వివరాలను పోలీస్ ఎఫ్ఐఆర్ తో సహా తనకు అందజేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. అదేవిధంగా చిత్ర నగరంలో పనిచేస్తున్న ఇల్లు లేని జర్నలిస్టులు వివరాలను తనకు అందజేస్తే తప్పకుండా వారికి ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా ధర్నా కార్యక్రమంతో పాటు, కలెక్టర్ ను కలిసిన వారిలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కోశాధికారి పట్నం కృపానందరెడ్డి, సంయుక్త కార్యదర్శి యాదవేంద్రరెడ్డి, ప్రచార కార్యదర్శి దినేష్ ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ( ఏపీ బిజెఏ ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయచంద్ర, నీరజాక్షలు, ఉపాధ్యక్షులు కమలాపతిరెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ కేశవులు, బాలసుబ్రమణ్యం, ఉపాధ్యక్షులు మురళీకృష్ణ, కోశాధికారి నాగరాజు, సంయుక్త కార్యదర్శులు కుభేంద్రన్, తులసిరెడ్డి, సురేందర్రెడ్డి, సత్యంప్రసాద్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
1980 దశకం వరకు బ్రాడ్కాస్ట్ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్, పి. శ్రీధర్ ఈశ్వర్, ఎస్ సౌజన్య, బివిఎల్ కె మనోహర్, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.
© APWJF All Rights Reserved.Design & Developed By